సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దివంగత ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు వెన్నుపోటు కు గురి అయ్యారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు శనివారం తొలిసారి కీలక వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. దశాబ్దాలుగా ఎవరు ఏమనుకున్నా చంద్రబాబు కు అనుకూల బీజేపీ నేతగా పేరున్న వెంకయ్య నాయుడు నేడు, శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తెలుగు వారికీ ప్రపంచ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన ఎన్టీఆర్ తన వ్యక్తిగత, రాజకీయ జీవితంఫై జరుగుతున్నా కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్ గమనిం చలేకపోయారు. రాజకీయాల్లోఎన్టీఆర్ భోళా మనిషి. ఏది గుంభనంగా ఉండదు. అందరిని నమ్మేసేవారని అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోసైలెం ట్ విప్లవాన్ని తెచ్చా రు. పేదల సంక్షేమానికి దేశానికే మార్గదర్శకమైన అనేక పథకాలు తెచ్చా రు అని ప్రశంసించారు.
