సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత మూలాలున్న తమినాడు కు చెందిన ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హారీస్ తో పోటీ పడి అమెరికా అడ్జక్షుడిగా ట్రాంప్ పీఠం ఎక్కనున్నారు. అయితే మరోసారి అమెరికాలో ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి.. వీరి పేరును స్వయంగా ట్రాంప్ తమ విజయోత్సవ సభలో ప్రకటించారు. ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మార్మోగిపోతోంది. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఉష తల్లితందులు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం కి చెందిన రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. వారు శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తే ఉషా చిలుకూరి. ఆమె భర్త జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ఉష కి విశాఖపట్నంలోనూ బంధువులున్నారు. వైజాగ్కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. 96 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
