సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నేడు, సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీయూష్ కుమార్ జీవో ఎంఎస్ నెంబర్ 30 జారీ చేశారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పలు నిబంధనలు కూడా విధించింది. ఒకే చోట 5 ఏళ్లు గడిచిన రాష్ట్ర ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేస్తామని ఆదేశించింది. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుండి మినహాయింపునిచ్చింది. గిరిజనఏజెన్సీ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించింది. మెడికల్ గ్రౌండ్లో భాగంగా వినతి మేరకు బదిలీల్లో సడలింపులు ఉన్నాయి.
