సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 7న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పర్యటన ఖరారు అయ్యింది. . ఈ సందర్భంగా నేడు, మంగళవారం సభా వేదిక ఏర్పాట్లపై టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి జవహర్, పీతల సుజాత నేడు, మంగళవారం ఆచంటలో నాయకులు కు , కార్యకర్తలకు టీడీపీ నేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. మరో 3 నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆచంట నుంచే ఎన్నికల శంఖారావం చంద్రబాబు పూరిస్తారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటించారు.
