సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉదయం 11 గంటల కు బడ్జెట్ ప్రసంగం మొదలు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించిన ప్రధాన అంశాలు ఏమిటంటే.. 1. ఉద్యోగులకు 12 లక్షల లోపు వరకు ఇన్కమ్ టాక్స్ చెల్లించనక్కర లేదని ప్రకటించడం పెద్ద హైలైట్ గా నిలచింది. 2. వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. 1.73 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. 3. ఐఐటీలు, మెడికల్ కాలేజీలలో సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఐఐటీలలో మౌలిక వసతులను పెంచనున్నారు. మరో 6,500 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. దేశంలోని మెడికల్ కాలేజీలలో వచ్చే అయిదేళ్లలో 75 వేల సీట్లు పెరగనున్నాయని ప్రకటించారు. 4. ఎంఎస్ఎంఈలకు రూ. 10 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు చెప్పారు. స్టార్టప్‌లకు ఇచ్చే రుణాల పరిమితి రూ. 20 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. 5. కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. గిగ్ వర్కర్లను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటూ వారికి గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. అదేవిధంగా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అందజేయన్నారు. 6. దేశంలోని 50 పర్యాటక స్థలాలను కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రైవేట్ రంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.7. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల కోసం ప్రభుత్వం జాతీయ తయారీ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మిషన్ క్లీన్ టెక్నాలజీకి మద్దతిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ కోసం సౌర ఘటాలు, EV బ్యాటరీల కోసం పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుందని తెలిపారు. 8. దేశంలోని 8 కోట్ల మంది చిన్నారులు, మహిళలకు పోషకాహారం అందించేందుకు సక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *