సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం తమ ప్రధాన 12 డీమాండ్ లు నెరవేర్చాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో.. రైతులకు డబ్బు చెల్లింపులో అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. డీసీసీబీల్లోని సూపర్వైజర్లు, స్టాఫ్ అసిస్టెంట్లను పీఏసీఎస్ల్లో ఇన్చార్జిలుగా తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి అనుమతించింది. ఈమేరకు డీసీసీబీలకు తగిన ఆదేశాలు జారీ చేసేలా ఆప్కాబ్ ఎండీకి సహకార శాఖ కమిషనర్ అహ్మద్బాబు లేఖ రాశారు.
