సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోమారు ఏపీ సీఐడీ అధికారులు నేడు, బుధవారం ఉదయం రావడం జరిగింది. అయితే రఘురామ రాజు బయటకు రాకపోవడంతో సీఐడీ అధికారులు ఇంటి బయట వేచి చూసారు అని తెలుస్తుంది.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు తెలిపారు. గతంలో రఘురామ కృష్ణరాజుపై ఏపీలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆ కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగకు రేపు అనగా ఈనెల 13న భీమవరం లోని తన నివాసానికి వచ్చి 2 రోజులు గడుపుతానని ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సిఐడి తాజా గా ఇచ్చిన నోటీసులు ప్రభావం ఆయన భీమవరం పర్యటనపై ఏ మేర ప్రభావం చూపనుందో..? వచ్చి చూడాలి..
