సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2015లో నాని హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’కే అశ్వనీదత్, స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ నిర్మించారు. దీనిని ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం మొదటి రిలీజ్ నాటి కన్నా ఇటీవల నేటి సమాజంలో బాగా మారిపోయిన పరిస్థితులకూ అద్దం పడుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. మంచి ఫీల్ ఉన్న సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు’ అని అన్నారు. కల్కి సినిమా లో మహా భారత్ యుద్ధ సన్నివేశాల కధ గమనాన్ని చుపించాము. దానిమీదే ప్రస్తుతం కల్కి-2 స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్తుంది అని భావిస్తున్నాను. అయితే రిలీజ్ డేట్ మాత్రం అడక్కండి.. ఈసారి మహా భారత్ లోని కర్ణుడి పాత్ర లో ప్రభాస్‌ స్ర్కీన్‌ ప్రజెన్స్‌ పార్ట్‌-2లో ఎక్కువగానే ఉంటుంది.ఈ పదేళ్ల నా కెరీర్‌ సంతృప్తిగానే ఉంది. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని కొత్త తరహా సినిమాలు చేస్తున్నాను’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *