సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ చివరి నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని ప్రారంభిస్తోంది. ఈ సర్వే కోసం ప్రభుత్వం జీవో నంబర్ 207 జారీ చేసింది. దీన్నే మనం కుటుంబ సర్వే అని భావించవచ్చు. ప్రభుత్వ పధకాలు కోరుకొనే ఏపీ ప్రజలంతా ఈ సర్వేలో తప్పనిసరిగా సచివాలయ ఉద్యోగులకు సహకరించాలి. ఈ సర్వే కోసం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం Unified Family Survey (UFS) 2025 అధికారిక యాప్‌ని ఇచ్చింది. ఈ యాప్ ద్వారా.. సచివాలయ ఉద్యోగులు ప్రతి కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేస్తారు. సంబంధిత కుటుంబానికి ఉన్న ఆస్తులు, అప్పులు, వాహనాల వివరాల్ని నమోదు చేస్తారు. అని సమాచారం. అలాగే.. కుటుంబంలోని ప్రతీ వ్యక్తి నుంచి ఈ-కేవైసీ పూర్తి చేయిస్తారు. ప్రజలు కుటుంబానికి సంబందించి ముఖ్యమైన పత్రాలన్నీ రెడీగా ఉంచుకోవాలి. అయితే అన్ని వివరాలు ఇస్తే ప్రభుత్వ పథకాలు రద్దవుతాయా?: ఈ కుటుంబ సర్వే అనగానే ఏపీలోని చాలా కుటుంబాల్లో పెద్ద టెన్షన్ ఉంది. అయితే దానిపై ప్రభుత్వ వివరణ లేదు. అసలు ప్రజలకు సంబంధించిన వాస్తవ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగాల స్థితి వంటి వివరాలు తెలుసుకొనేందుకు ప్రభుత్వం సర్వే చేయిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *