సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర సంస్థ కాగ్‌ వెల్లడించిన నివేదిక చాల ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలకు విరుద్ధంగా ఖజానా గణారకాలు కనిపిస్తున్నాయి. తాజాగా నవంబర్‌ నెలాఖరుకు సంబంధించిన నివేదికలను కాగ్‌ విడుదల చేసింది. గతం కన్నా రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిపోవడంతో పాటు ఖర్చుల వ్యయం భారీ నమోదుకావడం, లోటు కూడా అంచనాలకు మించి నమోదుకావడం వంటివి ఈ నివేదికలో వెల్లడయ్యాయి. ఈ బడ్జెట్‌లో ఆదాయ లోటును 34 వేల కోట్ల వరకు ప్రతిపాదించగా, నవంబర్‌ నాటికి ఆ లోటు ఏకంగా 56,804 కోట్లకు నమోదుకావడం విశేషం. అంటే బడ్జెట్‌ అంచనాల కన్నా ఏకంగా 163 శాతం, గతేడాది ఇదే సమయం కన్నా 210 శాతం అధికంగా నమోదైంది. బడ్జెట్‌లో 68,773 కోట్లుగా ప్రతిపాదించగా, నవంబర్‌ నాటికే 65 వేల కోట్లు దాటిపోయియింది. గతేడాది కన్నా ఇది 120 శాతం అధికం కావడం గమనార్హం. అదికాక కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. . కేంద్ర పనుుల్లో రాష్ట్ర వాటా నిధులు 35 వేల కోట్ల వస్తాయని అంచనా వేసుకోగా, ఇప్పటివరకు 62 శాతంతో 22 వేలకోట్ల వరకు వచ్చాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 13,500 కోట్లుకుగాను 5,438 కోట్లు, జిఎస్‌టి ద్వారా 52 వేల కోట్లకుగాను 32 వేలకోట్లు, అమ్మకపు పన్ను ద్వారా 24,500 కోట్లకుగాను 11,303 కోట్లు, రాష్ట్ర ఎక్సయిజ్‌ పన్నుల ద్వారా 25,597 కోట్లకుగాను 12,154 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖజానాకు చేరుకున్నాయి.రుణాల భారం కూడా ఖజానాపై ఎక్కువగానే పడుతోరది. వాస్తవానికి మొత్తం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో 68,360 కోట్లు రుణంగా సమీకరించుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఈ 8నెలల కాలానికే 65,590 కోట్లు తీసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *