సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆలిండియా సినీ రెబల్ స్టార్, భీమవరం బ్రాండ్, ప్రభాస్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు తో ప్రజలు, రైతులు పడ్డ ఇబ్బందుల దృష్ట్యా ఈ విపత్తు కారణంగా వెలది కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందిస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, తారక్, బాలకృష్ణ తదితరులు 25 లక్షల చప్పున విరాళాలు ప్రకటించారు. తాజాగా, ప్రభాస్ కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఈయన భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు.
