సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు మువ్వనేల జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర పోలిసుల గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. మన దేశానికీ అనేక మంది స్వాతంత్ర్య సమర యోధుల ప్రాణ త్యాగాలు మరియు వారి నిస్వార్థ జీవితం వల్లనే మనకు స్వాతంత్ర్య లభించిoదని వారిని ఎల్లప్పుడూ స్మరించుకోవాలని, భారత్ లో రాజ్యాంగం అమలులోకి వచ్చి సర్వసత్తాక గణ తంత్ర దేశంగా మన దేశం అవతరించిన ఈ జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మన భారతీయులందరి పోరాట స్ఫూర్తి, సమైక్యత, దేశంలో ప్రజా స్వామ్య విలువలను ప్రపంచానికి చాటి చెపుతుందన్నారు.
