సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల స్కిన్ లెస్ చికెన్ ధరలు కేజీ సుమారు 370- 400 కు పెరిగినా, మధ్యవర్తుల, దళారుల విధానాల వల్ల తాము లాభపడడం లేదని తెలుగు రాష్ట్రాలలో వ్యాపారులు అంటున్నారు. పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగుతున్నారు. పెరిగిన రవాణా చార్జీలు చాల తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలనివీరి బంద్ విజయవంతం అయితే ఏపీలో కూడా దీని ప్రభావం తప్పకుండ ఉంటుంది.
