సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారు ప్రాంతం ఉండి నియోజకవర్గం పరిధిలోని పెద అమిరం గ్రామంలో 1750 లో నిర్మించిన ‘శ్రీ బ్రహ్మ సూత్ర లింగం మల్లేశ్వర స్వామి‘ వారి ఆలయాన్ని నేటి సోమవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే, రఘురామ కృష్ణంరాజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి మాట్లాడుతూ.. త్వరలో ఈ పురాతన ఆలయాన్ని ఆధునిక అలంకారాలతో వసతులతో పునర్నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. తదుపరి కాళ్ళ మండలం, ఏలూరుపాడు మేజర్ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు.
