సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నవంబర్ 2 నుండి పవిత్ర కార్తీక మాసం సందర్భంగాఆ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలలో భక్తుల సౌకర్యం కోసం పంచారామ క్షేత్రదర్శిని టూర్ ప్యాకేజీ అందుబాటులోనికి తెచ్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్వీఆర్.వర ప్రసాద్ తెలిపారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో భీమవరంతో సహా మిగతా ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ఆదివారం బయలుదేరి సోమవారం ఒక్కరోజులోనే అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలను దర్శించుకుని వచ్చేవిధంగా ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పల్లె వెలుగు రూ.720 ఎక్స్ప్రెస్ రూ.900 ఆలా్ట్ర డీలక్స్ రూ.1100 సూపర్ లగ్జరీ రూ.1200 టిక్కెట్ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసులను పెంచుతామన్నారు. ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు.
