సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశప్రజలు, వ్యాపారస్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చుసిన క్షణాలు ఈ రోజు వచ్చాయి. ఎన్నో ఆశలు, అంచనాల మధ్య మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023-24 ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, ప్రణాళికలుతో కూడిన ఆర్థిక పత్రాన్ని సమర్పించారు. బడ్జెట్ లో ఈ సారి ఇచ్చిన ప్రాధాన్యతలను గమనిస్తే.. కీలకమైనవి.. దేశంలో కనీసం 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగు దిశగా ప్రోత్సహించడం. రూ.19,700 కోట్లతో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు… 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం. విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు… దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం… 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్లు… కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ. అన్ని వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు… వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్… చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి చెయ్యడం.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్… గిరిజన మిషన్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు.. దేశంలో రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు.. ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు… దేశంలో రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు… రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. దీని కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు. బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు,.. ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం.. కొత్తగా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు… దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్ నిర్మాణం నికి నిధులు కేటాయింపులు చేసారు. .
