సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ఫై అమెరికా , ఇజ్రాయిల్ మిసైల్స్ అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ బావులపై మిసైల్స్ వేసి పేల్చేస్తుంటే .. దానికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికాకు సహకరిస్తున్న పొరుగునే ఉన్న 8గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్ లోని క్రూడ్ ఆయిల్ బావులను కూడా అదే రీతిని బాంబులతో లేపేస్తున్నారు. ఈ ద్వంస రచన లో ఒకవేళ యుద్ధం ఆగినప్పటికీ ప్రపంచానికి పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఆయిల్ కొరత చాల కాలం ఉంటుందని స్వష్టం అయ్యింది. ఎంత పెంచిన ధరలు కు కొందామన్నా కావలసిన సరుకు లేదు.దీనితో యుద్ధ ప్రభావం భారత్పై పడింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కు కమర్షియల్ గ్యాస్ సిలెండర్లు సప్లై ఆగిపోవడంతో చేసింది లేకే హోటల్స్ బంద్ అయ్యాయి. కర్ణాటక తమిళనాడు లో ఇప్పటికే హోటల్స్ బంద్ చేస్తున్నారు. వేలాది పనివారికి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. గృహ అవసరాల కు రేషన్ లో తప్ప కమర్షియల్ సిలిండర్ల సరఫరా దేశవ్యాప్తంగా నిలిచిపోతుంది. గృహ అవసరాలకు సైతం గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. 25 రోజుల తర్వాతే సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
