సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న నేడు వర్షాలు తగ్గి ఎండలు కాస్తున్నప్పటికీ.. ఉభయ గోదావరి జిల్లాల నడుమ ఉగ్రరూపంతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు పెరిగింది. బ్యారేజ్కు చెందిన 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 13.27 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతోంది. పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.గోదావరి వరద గండం తో జలదిగ్బందంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఉన్నాయి. కాజ్ వేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజేవేలు నీట మునిగాయి. నాటుపడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు సెలవులు ప్రకటించారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద కు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి
