సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బాపట్ల జిల్లాలో నేడు, సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్య ప్ప భక్తులు దుర్మ రణం పాలయ్యా రు. వేమూరు మండలం జంపని వద్ద జరిగిన ఈ ఘటనలో మరో 16మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలిం చారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో కన్ను మూశారు. మృతులను బొల్లిశెట్టి పాండురంగారరావు, బుద్దన పవన్ కుమార్, బార్డటి రమేష్, పాశం రమేష్ గా గుర్తించారు. మృతులది కృ ష్ణా జిల్లా,పెడన నియోజకవర్గం ,నిలపూడి గ్రామంగా గుర్తించారు. ఘటన సమయంలో వాహనం లో 22 మంది ఉన్నారని, తీవ్ర పొగ మంచు కారణంగానే వారి వాహనం అదుపుతప్పి రోడ్డు పరిధిదాటి తిరగబడింది ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *