సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు సందర్భముగా నేడు. గురువారం ఈ సందర్భంగా లోకేష్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా లోకేష్ కు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ.. ( ఇటీవల ఉప సీఎం పదవిపై రచ్చ ముగిసింది అనుకుంటుండగా..)కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు.. 2019 ఎన్నికల తర్వాత దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారని,. ఆ సమయంలో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను వైసీపీ నేతలు తీవ్రంగా వేధించారని ఈ సమయంలో యువగళం పాదయాత్ర చేసి పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోకేష్ ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. ఆ స్ఫూర్తి తో కూటమికి 164 స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారని ‘‘ఎవరు వద్దన్నా, కాదన్నా… టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు లోకేష్. రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఈ విషయాన్నే చెబుతాడు… ఇందులో ఏ వివాదం లేదు. ఏ నిర్ణయాలు అయినా కూటమి పెద్దల నిర్ణయం తర్వాతే అమలు చేస్తాం. ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి విధానం కాదు…ఇదీ అందరూ పాటిస్తున్నాం’’ అని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు..
