సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్.. అవినీతి కి పాల్బడిన ఆరోపణపై అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత పిటిషన్ పై విచారణ జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 16కి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అధికారులు, దర్యాప్తు సంస్థను లోకేష్ తో సహా చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది. రెడ్ డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ బెదిరిస్తున్నారని కోర్ట్ కు పిర్యాదు చేసారు.
