సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో..జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కార్యాచరణ ప్రారంభం అయిన నేపథ్యంలో .. 2027 లో దేశం అంతా ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జారుతాయని రాజకీయా విశ్లేషకులు భావిస్తుండటంతో.. మరల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఈనేపథ్యంలో మాజీ సీఎం జగన్, జనవరి నుండి మరల ప్రజలలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. తాడేపల్లిలో నేడు, శుక్రవారం మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే జనవరి సంక్రాంతి తరువాత నుంచి ఏపీలో అన్ని జిల్లాలలో స్వయంగా పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు.. తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని..సూపర్ సిక్స్ పధకాలు ఎగ్గొట్టడంతో ప్రతి ఇంటా ప్రజలలో జరిగిన మోసం ఫై చర్చ జరుగుతుందని.. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వారి తరపున గట్టిగా నిలబడితే అధికారంలోకి వస్తామని అన్నారు.జిల్లాల పర్యటనలో నేతలతో పాటు నేరుగా కార్యకర్తలతోనే జగన్ సమావేశంఅవుతానన్నారు. వారి నుంచే స్వయంగా సలహాలు, సూచనలు తీసుకొంటానని జగన్ అన్నారుఅలాగే రోజుకు మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ కానున్నట్లు జగన్ తెలిపారు.
