సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నేడు, శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున మార్చి 29వ తేదీ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు ప్రకటించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమైంది. తెలుగుదేశం ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుందని, తెలుగుదేశం మరోసారి మీ అందరికీ టీడీపీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *