సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేడు, బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని.. ఏ పార్టీ అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని ప్రకటించారు. ఏపీలో డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని అన్నారు. నిజమైన ఓట్ల తొలగించినవారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *