సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పుడు సమయం ఉదయం 11.40 కావస్తుంది. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. లీడింగ్ లో బీజేపీ ఉన్నపటికీ ప్రస్తుతం ఉన్న బాల బాలలు ప్రకారం మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ 41 స్థానాలలో ఆధిక్యంలో ఉంటె అధికార అం అండ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలలో ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికి చాల నియోజకవర్గాలలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికి దాదాపు 15 నియోజకవర్గాల్లో ఆప్, బీజేపీ మధ్య 3000 లోపు ఓట్ల మార్జిన్ మాత్రమే ఉంది. ఈ స్థానాల్లో పరిస్థితి మారితే.. అందుకే మరో 2 -3 గంటల పాటు కౌంటింగ్ పక్రియ పూర్తీ అయ్యేవరకు వేచి చూడాలి. అప్ అధినేత క్రజ్ వాల్ తన సమీప బీజేపీ అభ్యర్థి కంటే 260 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ఇంకా 6 రౌండ్స్ లెక్కింపు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *