సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో రోజు పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు నేడు, శుక్రవారం బ్రేక్ పడింది. 10 గ్రాములకు . రూ. 270 తగ్గింది. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 250 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 73,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,600 ఉంది. అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి కిలో ధర రూ. 89,200 పలుకుతుంది. నేడు తెలుగు రాష్ట్రాలలో .. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,750 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,600 గా ఉంది.
