సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో భక్తులకు వసతి కోటా జూన్ 2025కు సంబంధించిన టికెట్లను కూడా ఈ మార్చి 24న అందుబాటులో ఉంచనుంది. సోమవారం (మార్చి 24) మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో జూన్ నెలలో వసతి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా ఇప్పటికే ఇతర దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే వసతి గదులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుది. రూ.100. రూ.300 వసతి గదులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఇక టీటీడీ తిరుమల తిరుపతిలోని స్థానిక ఆలయాల సేవా కోటా ఏప్రిల్ 2025 కు సంబంధించిన టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన. ఈ సేవా టికెట్లను మార్చి 25, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *