సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో ఫిబ్రవరి 4వ తేదీ న రథసప్తమిని పురస్కరించుకుని భక్తులకు ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుఅధ్యక్షతన నేడు, శుక్రవారం సమావేశమైంది. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేది న సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తారని అన్నారు. రథసప్తమి నాడు ఉదయం 6:44 గంటలకు సూర్యోదయ గడియలు వస్తాయని, ఈ గడియల్లో శ్రీవారిని సూర్య కిరణాలు తాకుతాయని చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకుని రెండు లక్షల మంది వస్తారని అంచనా ఉందన్నారు. కావున రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామన్నారు. టైం స్లాట్ టికెట్స్ను ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రద్దు చేశామని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. రథసప్తమి సందర్భంగా 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ఆలయ మాడ విధుల్లో చలవపందిళ్లు ఏర్పాటు చేశామని.. 8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడుతామన్నారు. తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు
