సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సేవ కోసం ఎదురు చూస్తున్న భక్తులకు అద్భుత అవకాశం మళ్ళీ వచ్చింది. అయితే, శ్రీవారి సేవ కోటా లో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సాధారణ సేవ, 12 గంటలకు నవనీత సేవ (మహిళలకే), 1 గంటకు పరకామణి సేవ (పురుషులకే), మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ లీడర్ సేవ టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసిన వారై ఉండాలని చెప్పారు. వయస్సు 45 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు నమోదు చేసుకోవచ్చు అన్నారు. వీరు 15 రోజులు, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చును . నిన్న సోమవారం 65,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 24,487 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
