సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లీమ్ సోదరులు బక్రీద్ (Bakrid) పర్వదినం ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్. త్యాగబుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోంది. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పొచ్చు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని బక్రీద్ సందర్భంగా కోరుకుంటున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
