సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా, దీపావళి, క్రిస్మస్, ఛాట్.. తదితర పండుగల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే పరిధిలో నడుస్తున్న 60ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కీలకమైన లింగంపల్లి-కాకినాడ టౌన్, తిరుపతి-మచిలీపట్నం సికింద్రాబాద్-నాగర్సోల్, సికింద్రాబాద్-రామనాథపురం కాచిగూడ-మధురై, నాందేడ్-ఈరోడ్, కాచిగూడ-నాగర్సోల్, సికింద్రాబాద్-కొల్లాం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి, ఉన్నాయి
