సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: దీపావళి నేపథ్యంలో ఒక రోజు ముందుగా గత శనివారం రాత్రి మెగాస్టార్ తనయుడు.. రామ్చరణ్, ఉపాసన దంపతులు తమ నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి తమ నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈవేడుకలకు పెద్దోడు చిన్నోడు వెంకటేశ్, మహేశ్బాబు కలసి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. మొన్న వెంకీ కూతురు నిచ్చితార్ధం లో విజయవాడలో మెరసి పండుగ చేసిన చిన్నోడు మరోసారి ఇటీవల హైదరాబాద్ లో ఒక ప్రెవేటు పంక్షన్స్ లో పెద్దోడు తో ఒకే టేబుల్ లో జంటగా ప్రక్క పక్క కూర్చుని సరదాగా మిగతా ప్రముఖులతో కార్డ్స్ ఆడుతూ ప్రముఖులతో సందడి చేసారు. ఇది గత 3వారాలలోఇది మూడోసారి కలయిక వారు ఆలా పిక్స్ అయ్యారు .. దిల్ రాజు సీతమ్మ వాకిట్లో .. సీక్వల్ కు కధ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ పంక్షన్ లో మరో హైలైట్ జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి దంపతులతోఈ పార్టీలో సందడి చేశారు. RRR అల్లూరి .. రాంచరణ్ తో కొమరం భీం, జూనియర్ ఎన్టీఆర్ మాటామంత్రి కలిపారు. పలువురు సినీప్రముఖులతో విందు భోజనం, గేమ్స్తో ఎంజాయ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను మహేష్ భార్య నమ్రత స్టాగ్రామ్లో షేర్ చేసింది.
