సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల దేశంలో బంగారం ధరలు శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు పది గ్రాముల బంగారం ధర అత్యధికంగా 62,020 రూపాయలకు చేరుకుంది. నేడు, గురువారం ఒక్కరోజే పది గ్రాముల బంగారంపై ఏకంగా 940 రూపాయల ధర పెరగడం గమనార్హం. ఈ సంవత్సరం ముగిసే లోపు పది గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరుకొనే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
