సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద నేడు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాలీ లారీని అతి వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) గా గుర్తించారు. ఘటన జరిగిన కొద్దీ సేపటికే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన దుర్గా వంశీ, బాలుడు నాగ షణ్ముక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులు రాజవోలుకు చెందినవారుగా తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *