సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై వైసీపీ యువజన నేత రషీద్ ను జిలానీ అనే యువకుడు కత్తితో చేతులు నరికి తరువాత తల నరికి హత్య చెయ్యడం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఇతర మీడియా ఛానెల్స్ లో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్ కావడంతో చుసిన వారు తీవ్ర భయాందోనళకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, గురువారం ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికలలో ఓడిపోయిన వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో, కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అంటూ విరుచుకుపడ్డారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు.దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి మంత్రి అమిత్‌షాకి ఈ సందర్భంగా జగన్ విజ్క్షప్తి చేశారు. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొంటాను అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *