సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి నరసాపురంలో లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.2.50 లక్షల పింఛను సొమ్మును ఓ వీఆర్వో తన బైక్‌ డిక్కీలో పెట్టగా ఆగంతకులు కొట్టేసిన ఘటన తాజగా వెలుగుచూసింది. విషయంలోకి వెలితే.. బాధితుడు, స్థానిక ఐదో వార్డు సచివాలయ వీఆర్వో లక్ష్మీగణపతి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. గత గురువారం మునిసిపల్‌ అధికారుల నుంచి పింఛన్ల సొమ్ము రూ.2.50 లక్షల నగదును తీసుకున్నారు. ఆ సొమ్మును గత శుక్రవారం పంపి ణీ చేయాల్సి ఉండగా, బైక్‌ డిక్కీలో పెట్టుకుని, పట్టణంలోని తెలగా కళ్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల వివాహానికి వెళ్లిన తరువాత రాత్రి ఇంటికి వెళ్లి చూసే సరికి బైక్‌ డిక్కీలో సొమ్ము అని అధికారులకు పిర్యాదు చేసారు. అయితే తోటి రెవెన్యూ సిబ్బంది చందాలుగా వేసుకుని సహకరించగా రూ. 2.50లక్షలు మొత్తాన్ని వీఆర్వో శుక్రవారం లబ్ధిదారులందరికీ పంపిణీ చేశారు. దీనిపై . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయలక్ష్మి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *