సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శనివారం నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో దేశీయ సూచీలు నేడు, సోమవారం లాభాల బాటలో పయనిస్తాయని ఎక్కువ మంది భావించగా దానికి భిన్నంగా సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభ మయ్యాయి. ఆదాయపు పన్ను తగ్గింపు కారణంగా ఏఫ్‌ఎమ్‌సీజీ, బడ్జెట్ కేటాయింపుల వల్ల వ్యవసాయ ఆధారిత స్టాక్స్ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, RBI కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత శనివారం ముగింపు (77, 505)తో పోల్చుకుంటే నేడు, సోమవారం ఉదయం 500 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 750 పాయింట్లు కోల్పోయి 76, 756 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో 672 పాయింట్లు కోల్పోయి 76, 833 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 239 పాయింట్ల నష్టంతో 23, 243 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో ప్రస్తుతానికి 87.16గా మరింత పడిపోయింది. ఇది విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల పీజుల చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *