సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మిజోరాం లో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్ప కూలడంతో ఆ నిర్మాణానికి పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మరణించారు. .మిజోరం రాజధాని ఐజ్వాల్ కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతం లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం లో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్క సారిగా కుప్ప కూలడం తో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరి కొంతమంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.
