సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్కూలుకు వచ్చి పని చేస్తున్నట్లు నిర్ధారించడానికి సమయానికి స్కూల్ కు హాజరైన ఉపాధ్యా యులకు స్కూల్లో సెల్ ఫోన్లో తాజాఫొటోలు దిగి రికార్డు చేస్తున్న ఫేస్ ఆధారిత యాప్ హాజరు విధానాన్ని, అదే తరహాలో ఇకపై పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి, మంగళవారం నుండి వైద్య ఆరోగ్య శాఖలో నుంచి అమలు చేయనున్నారు. జగన్ సర్కార్ ఇటీవల రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులో కొందరు డాక్టర్స్, సిబ్బంది సమయానికి హాజరుకావడం లేదని, అందుబాటులో ఉండరని మరికొందరు అక్కడ తమ ఐడెంటిఫై చేసి మరలా వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ వారికీ కూడా ఫేస్ ఆధారిత హాజరును అమలు చేస్తోంది. ఈ విధానానికి సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని కొందరు వైద్య సిబ్బంది అభ్యన్తరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ .. నేటి నుండి పశ్చి మగోదావరి జిల్లాలో ఇప్పటికే 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 347 మంది వైద్యులు, సిబ్బంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ వైద్య శాలల్లోసిబ్బంది కొందరు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. వారికీ ఫేస్ ఆధారిత హాజరు నమోదు యాప్ వినియోగంపై వైద్య సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *