సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం హక్కు భుక్తములో యున్న శ్రీ స్వామివారి 87 ఎకరాల 71సెంట్లు వ్యవసాయ భూమి కి నేడు, శనివారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో .. 2024-2025 నుండి 2026-2027 వరకు అగు 3 సంవత్సరముల కాలం లీజు ఇచ్చుటకు నకు టెండర్-కమ్-బహిరంగ వేలం పాట నిర్వహించగా, వేలంపాటదార్లు సరైన లీజు ధరకు ఆసక్తి చూపని కారణం గా వేలం పాట నిలుపుదల చేయటమైనది. ఈ బహిరంగ వేలం పాటలను వర్ధినీడి వెంకటేశ్వర రావు,తనిఖీదారు, దేవదాయ శాఖ, భీమవరం వారి పర్యవేక్షణలోజరిగిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి డీ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
