సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, సోమవారం సంక్రాంతి పర్వదినాలు 4వ రోజు ముక్కనుము పర్వదినం సందర్భముగా మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీలు , మొహంది పోటిలులలో విజేతలకు బహుమతులు పంచె కార్యాక్రమం లో ప్రభుత్వ మీడియా ప్రతినిధి నటుడు అలీ కూడా పాలొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వైసిపి మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం రాష్ట్రంలో వైసిపి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్య క్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మంత్రి రోజాను డైమండ్ రాణి అన్నారు. నిజమే అన్ని ఆభరణాలు కన్నా వజ్రం చాల విలువైనది.వజ్రాలకు రాణి అంటే కోహినూరు .. అంటే రోజా వైసిపి కి కోహినూరు వజ్రం లాంటిది అని ఆయన ఉద్దేశ్యం.. ఇందులో తప్పెమేముంది.. పవన్ క ల్యా ణ్ నాకు మంచి మిత్రుడు. అయితే, సినిమాలు, రాజకీయం రెం డూ వేరు. రాబోయే ఎన్ని కల్లో వైసీపీ అధిష్ఠానం ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేయడానికి తాను సిద్ధమని నటుడు అలీ సంచలన ప్రకటన చేసారు.
