సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఆరోగ్య శాఖ ఎంప్లాయిస్ కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డిఎంహెచ్ఓ ని కలసిన ప్రభుత్వ ఆద్వర్యంలోని మెయిల్ హెల్త్ అసిస్టెంట్ లు వారి యొక్క విన్నతి ని తెలియజేసి తమ విజ్ఞాపన పత్రం ఆయనకు అందజెయ్యడం జరిగింది. దానిలో .. గత ఏడాది2023 సెప్టెంబర్ 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన GO . MS NO 167 ప్రకారం తమకు అందించే జీతాలతో ‘ మినిమమ్ టైం స్కేల్ ఇచ్చిన నేపథ్యంలో దాని ప్రతిఫలాలు ఇంకా పొందని నేపథ్యంలో అధికారులు తక్షణం తమ 100% గ్రాస్ జీతం ఇప్పించవలసిందిగా విన్నతి పత్రంలో కోరటం జరిగింది. వారి విన్నతి ని పరిశీలిస్తామని డిఎంహెచ్ఓ హామీ ఇచ్చారు.
