సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిడదవోలు సమీపంలోని సత్య వాడ రైల్వే స్టేషన్ వద్ద నేటి బుధవారం ఉదయం పాసింజర్ రైల్లో మంటలు వచ్చాయి. రైలు నిడదవోలు నుంచి నరసాపురం వెళ్తుండగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే ప్రమాదం గుర్తించి అప్రమత్తం అయిన రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చా రు. ప్రయాణికులు ఎవ్వరు గాయపడలేదు. అనంతరం రైలును తణుకు రైల్వే స్టేషన్ కు తరలించారు.
