సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య లంజ యుద్ధం ప్రారంభం కానుంది.. ఇటీవల పాకిస్తాన్ తమపై జరిగిపిన వైమానిక దాడుల నేపథ్యంలో అనేక ఆఫ్ఘన్ అమాయక ప్రజలు మరణించారని ఆఫ్గనిస్తాన్ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్గనిస్తాన్ దళాలు తాజాగా జరిపిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని సరిహద్దులలో అనేక పాక్ మిలటరీ పోస్టులను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. దీనితో పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఇక తమ సహనం నశించిందని చెప్పిన పాక్.. ఇక యుద్ధమేనని ప్రకటించింది. ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. మీకూ, మాకూ మధ్య యుద్ధమే అని పోస్టు పెట్టారు. నేడు శుక్రవారం అఫ్గానిస్థాన్‌‌లోని కాబుల్, కాందహార్ నగరాలపై పాక్ దాళాలు బాంబులతో వైమానిక దాడులకు దిగాయి.(war) ఈ దాడుల్లో కాబుల్‌లోని, కాందహార్‌లోని మిలిటరీ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ తెలిపింది. అయితే నేడు,శుక్రవారం తమ గగనతలంలోకి వచ్చిన రెండు పాక్ విమానాలను కూడా కూల్చేశామని ఆఫ్గనిస్తాన్ ప్రకటించింది.. ఈ ప్రకటనలను పాక్ ఖండించింది. అఫ్గాన్ సైనికులే 133 మంది చనిపోయారని, మరో 200 మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *