సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో తెలుగు దేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళన కు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు కీలక నేతలను గృహ నిర్బంధం చేసారు. జిల్లా కేంద్రం భీమవరం తదితర పట్టణాలలో ప్రధాన సెంటర్లలో పోలీస్ భద్రతా పెంచారు. ఈ నేపథ్యంలో పాలకొల్లు ఎమ్మె ల్యే నిమ్మ ల రామానాయుడు అస్వ స్థతకు గురయ్యారు. చం ద్రబాబుఅరెస్టు నేపథ్యంలో.. పాలకొల్లులోని ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో వాదనకు దిగిన నిమ్మల రామానాయుడు అకస్మాత్తుగా నిరసించి కిందపడి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో రామానాయుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్య తం టూ నినాదాలు చేసారు.
