సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం సమీపంలోని పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం మెయిన్ రోడ్డు వాటర్ ట్యాంక్ వద్ద గత శనివారం అర్ధరాత్రి ఓకే లారీ బీభత్సాన్ని సృష్టించింది. మెయిన్ రోడ్ లో వాటర్ ట్యాంక్ వద్ద పక్కనే పార్క్ చేసి ఉన్న కారును అర్ధరాత్రి సమయంలో లారీ ఢీకొట్టడంతో కారు ఆకారం మారిపోయి పూర్తీ నుజ్జు నుజ్జు అయింది.. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అని తెలుస్తుంది. స్థానికుల పిర్యాదు తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
