సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం పెద్ద గురువు గ్రామ వైసీపీ సర్పంచ్ రావూరి లాజర్ జనసేన పార్టీ తీర్థం తీసుకొన్నట్లు ప్రకటించారు. స్థానిక వైసీపీ నేత శ్రీనివాసరాజు నాయకత్వంలో లాజర్ వారి మిత్ర బృందం అందరూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు సమక్షంలో పార్టీలోకి చేరినట్లు పార్టీ ప్రకటన విడుదల చేసింది. గత నెల రోజులుగా అన్ని ప్రాంతాల నుండి జనసేన లోకి వైసీపీ నుండి వలసలు వస్తుండటంతో కూటమి మరింత బలోపేతం అవుతుందని అంజిబాబు అన్నారు.
