సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి పార్టీ మాజీ జిల్లా అడ్జక్షుడు. ప్రస్తుత పోలవరం ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు గత మంగళవారం తీవ్ర అస్వ స్థతకు గురయ్యా రు. తీవ్ర నీరసంగా ఉందని బాలరాజు జంగారెడ్డిగూడెం లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్నా రు. అక్క డ పరీక్షలు చేసిన వైద్యు లు బాలరాజుకు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి రిఫర్ చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను రాజమండ్రిలోని సాయి ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెకు స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం నేడు, బుధవారం ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును, గత రాత్రి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తదితరులు ఆసుపత్రికి హాజరు అయ్యి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొని బాలరాజు కుటుంబ సభ్యులకు దెర్యం అందించారు.గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వైసిపి నేతలు బాలరాజు త్వరగా కోలుకోవాలని ఆయన క్షేమ సమాచారాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *