సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆసియా ఖండంలోనే ప్రతిష్టాకర నీటి ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అక్కడ ఎగువ, దిగువ కాఫర్ డ్యాం ల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించామని, డీ వాటర్ వర్క్ అనంతరం వైబ్రో కాంపాక్ట్ పనులు అతి త్వరలో మొదలవుతాయన్నారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాం ల మధ్య .. సీఫేస్ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ‘నిర్వాసితుల సమస్యను పరిష్కరించేం దుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూ సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీకి బిల్లు పంపాం . 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాలి. 41.15 వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటాం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
