సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గత డిసెంబర్ 4వ తేదీనతెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజగా.. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. నేటి ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గత శనివారం రాత్రి 10.35గంటల సమయంలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. గుండ్లకమ్మ నది స్వరూపంలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుర్తించారు.గత మూడేళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *